‘బిగ్‌ సి’ పండగల ధమాకా ఆఫర్‌

ABN , First Publish Date - 2020-10-17T05:42:52+05:30 IST

దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ‘బిగ్‌ సి’ అతిపెద్ద ఫెస్టివ్‌ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భా గంగా బిగ్‌ సి షోరూమ్‌ల్లో మొ బైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన

‘బిగ్‌ సి’  పండగల ధమాకా ఆఫర్‌

బహుమతిగా రూ.కోటి పంపిణీ

ఇతర ఆకర్షణీయ ఆఫర్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ‘బిగ్‌ సి’ అతిపెద్ద ఫెస్టివ్‌ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భా గంగా బిగ్‌ సి షోరూమ్‌ల్లో మొ బైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారి లో లక్కీ డ్రా ద్వారా 100 మంది ని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బిగ్‌ సి సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపారు. ఈ విధంగా ఫెస్టివ్‌ ధమాకా ఆఫర్‌లో రూ.కోటి బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు.


నగదు బహుమతితో పాటు మొబై ల్‌ కొనుగోలుపై 5,000 వరకూ క్యాష్‌ పాయింట్లను కూడా ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై 10 శాతం వరకూ క్యాష్‌ బ్యాక్‌, మొబైల్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. 

ఆన్‌లైన్‌లో మొబైల్‌ ఫోన్‌ను బుక్‌ చేసిన వారికి 90 నిమిషాల్లో డోర్‌ డెలివరీ ఇవ్వనున్నట్లు బాలు చౌదరి వెల్లడించారు. అతిపెద్ద ఫెస్టివ్‌ ధమాకాను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం నుంచి వన్‌ప్లస్‌ 8టీ మొబైల్‌ ఫోన్లు అన్ని బిగ్‌ సి షోరూమ్‌ల్లో లభిస్తాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.


సామ్‌సంగ్‌ ఏ, ఎం సిరిస్‌ మొబైల్‌ ఫోన్లపై 10 శాతం హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌ బ్యాక్‌ ఉందన్నారు. షామీ మొబైల్‌ ఫోన్లపై 10 శాతం ఎస్‌బీఐ క్యాష్‌ బ్యాక్‌ ఉంది. వన్‌ప్లస్‌ మొబైల్స్‌పై రూ.3,000 వరకూ హెచ్‌డీఎ్‌ఫసీ క్యాష్‌ బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇంకా మరిన్ని ఆఫర్లు ఉన్నాయని, సులభ వాయిదాల పద్ధతిలో వడ్డీ లేకుండా మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించినట్లు బాలు చౌదరి చెప్పారు. 


Updated Date - 2020-10-17T05:42:52+05:30 IST