ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్వీట్‌ చేసిన డీజీపీ

ABN , First Publish Date - 2020-04-04T09:56:45+05:30 IST

డీజీపీ మహేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్వీట్‌ చేసిన డీజీపీ

రీట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): డీజీపీ మహేందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలసకూలీలు, పేదల ఆకలి తీర్చేందుకు పోలీసుశాఖ ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ‘అన్నార్తులకు బాసటగా.. .పోలీసు శాఖ వాట్సాప్‌ గ్రూప్‌’ శీర్షికతో ఆంధ్రజ్యోతి శుక్రవారం ప్రముఖంగా ప్రచురించింది. పోలీసు వాట్సాప్‌ గ్రూప్‌నకు మరింత ప్రచారం కల్పిస్తూ డీజీపీ ఆ కథనాన్ని ట్వీట్‌ చేశారు. దానికి మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేయడం విశేషం. కాగా.. లాక్‌డౌన్‌ విధినిర్వహణలో అలసిన ఓ పోలీసు రోడ్డుపై బారికేడ్‌ నీడలో నిద్రించిన ఓ ఫొటోను డీజీపీ ట్వీట్‌ చేశారు. ‘‘అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందికి సెల్యూట్‌’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. అత్యవసర సేవలు అందిస్తున్న వైద్యులపై దాడి సరికాదని ఆయన ట్విటర్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2020-04-04T09:56:45+05:30 IST