నెల రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్‌ :DGP Shailendra Babu

ABN , First Publish Date - 2021-12-08T16:41:49+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు వంటి విద్యాసంస్థల సమీపంలోన సాగుతున్న గంజాయి విక్రయాలను నెల రోజుల్లో పూర్తిగా అరికట్టాలని పోలీసు యంత్రాంగానికి డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయంపై అన్ని పోలీస్‌స్టేషన్లకు

నెల రోజుల్లో గంజాయి విక్రయాలకు చెక్‌ :DGP Shailendra Babu

చెన్నై/అడయార్: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు వంటి విద్యాసంస్థల సమీపంలోన సాగుతున్న గంజాయి విక్రయాలను నెల రోజుల్లో పూర్తిగా అరికట్టాలని పోలీసు యంత్రాంగానికి డీజీపీ శైలేంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. ఇదే విషయంపై అన్ని పోలీస్‌స్టేషన్లకు డీజీపీ కార్యాలయం నుంచి సర్క్యులర్‌ వెళ్లింది. పాఠశాలలు, కాలేజీలకు సమీపంలో సాగుతున్న గంజాయి, పాన్‌పరాక్‌, గుట్కా వంటి మత్తుపదార్థాలతో పాటు లాటరీ టిక్కెట్ల విక్రయాలను డిసెంబరు 6వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు  నెల రోజుల వ్యవధిలో పూర్తిగా అరికట్టాలని, ఈ విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించి, వారిపై గూండా చట్టం కింద అరెస్టు చేయాలని డీజీపీ ఆదేశించారు. మత్తు పదార్థాలకు బానిసలైన విద్యార్థులను గుర్తించి వారికి మానసిక వైద్యుల వద్ద కౌన్సెలింగ్‌ ఇప్పించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-08T16:41:49+05:30 IST