పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదు: డీజీపీ సవాంగ్
ABN , First Publish Date - 2021-10-20T20:22:05+05:30 IST
పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదని డీజీపీ సవాంగ్ అన్నారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని తిట్టకూడదన్నారు.
అమరావతి: పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదని డీజీపీ సవాంగ్ అన్నారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని తిట్టకూడదన్నారు. అభ్యంతరకమైన పదాలు పదేపదే వాడారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎథిక్స్ పాటించాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. నిన్న తనకు వాట్సప్ కాల్ వచ్చిందని, అప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను... ఎవరు మాట్లాడుతున్నది స్పష్టంగా లేదన్నారు. నిన్న జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు.