గరికపాడు చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2020-04-03T19:44:19+05:30 IST

ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతం.. గరికపాడు చెక్‌పోస్ట్‌ను డీజీపీ..

గరికపాడు చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన ఏపీ డీజీపీ

కృష్ణాజిల్లా: ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతం.. గరికపాడు చెక్‌పోస్ట్‌ను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. తెలంగాణ నుంచి వాహనాల్లో వస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొంది అంబులెన్స్‌లో విశాఖ‌ వెళుతున్న మహిళను చెక్ పోస్ట్ వద్ద పరిశీలించి.. వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అలాగే చెక్ పోస్ట్ వద్ద దాతల సహాయంతో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా లారీ డ్రైవర్‌లు, క్లీనర్‌లకు ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు. అనంతరం గౌతమ్ సవాంగ్ గరికపాడు చెక్ పోస్ట్ నుంచి 13జిల్లాల‌ చెక్ పోస్ట్‌ల పరిస్థితిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Updated Date - 2020-04-03T19:44:19+05:30 IST