రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నాం : డీజీపీ
ABN , First Publish Date - 2022-05-25T18:08:19+05:30 IST
ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు.
అమరావతి : ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. కోనసీమలో తాజా పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరించారు. అమలాపురం అల్లర్ల ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పు, 3 బస్సుల దహనంపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు. మరో 72 మంది అరెస్ట్కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సాప్ గ్రూప్లలో తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు.