‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సేలేన్సీ’ ఏర్పాటు: డీజీపి

ABN , First Publish Date - 2022-06-12T00:38:56+05:30 IST

రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపి(dgp) మహేందర్ రెడ్డి(mahender reddy) వెల్లడించారు.

‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సేలేన్సీ’ ఏర్పాటు: డీజీపి

హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపి(dgp) మహేందర్ రెడ్డి(mahender reddy) వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు,రాష్ట్రంలోని ప్రముఖ ఐటి సంస్థలు, IIT, IBM లాంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సేలన్స్ ను త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సైబర్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అనే అంశంపై జరిగిన ఒక రోజు జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి డీజీపి హాజరై ప్రసంగించారు. 


ఈ సందర్భంగా సైబర్ నేరాల నిరోధం పై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ కీలక పాత్ర పోషిస్తోందని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800 లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాస్త్ర స్థాయిలోను సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ యూనిట్ లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మరో మూడేళ్ళలో దేశంలో సెల్ ఫోన్ వినియోగ దారుల సంఖ్య ఒక బిలియన్ కు చేరుకుంటుందని అన్నారు. 


ప్రస్తుతం ప్రతీ ఒక్కరిదీ డిజిటల్ లైఫ్ అయిందని, ఇదే స్థాయిలో కూడా సైబర్ నేరాల గ్రాఫ్ కూడా గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని డిజిపి పేర్కొన్నారు. ఈ సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు గాను మొత్తం పోలీస్ వ్యవస్థనే పటిష్ట పరుస్తున్నామని తెలిపారు.



దీనిలోభాగంగా,ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ కోర్దినేషన్ సెంటర్ (T 4 C) ను ప్రారంభించామని తెలిపారు. ఇది, నేర నిరోధంలో కీలక పాత్ర వహిస్తోందని అన్నారు.దేశంలోని అన్ని ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ డిజిటలైజ్ చేసినందున,ఇదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల నగరంలో ఒక బ్యాంక్ ద్వారా రూ.20 కోట్లు తరలించిన అంశాన్ని ఉదహరిస్తూ, మరో పదేళ్ళలో ఎదురయ్యే సైబర్  క్రైమ్ లను గుర్తిచి దాని కనుగుణంగా తగు నివారణ ను సూచించేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సేలెన్సీ పనిచేస్తుందని అన్నారు.


Updated Date - 2022-06-12T00:38:56+05:30 IST