సెల్ఫీ మోజులో నదిలోకి దిగిన ఏడుగురు యువతులు... ఒక యువతి గల్లంతు!

ABN , First Publish Date - 2021-01-19T16:52:03+05:30 IST

ఆ యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని...

సెల్ఫీ మోజులో నదిలోకి దిగిన ఏడుగురు యువతులు... ఒక యువతి గల్లంతు!

దేవాస్: ఆ యువతుల సెల్ఫీ మోజు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో సెల్ఫీ తీసుకోవాలన్న ఆతృతలో ఏడుగురు యువతులు ప్రమాదానికి గురయ్యారు. వీరంతా సెల్ఫీ తీసుకునే ఉద్దేశంతో నదిలో దిగి, నీట మునిగారు. వీరిలోని ఆరుగురిని అక్కడున్న మత్స్యకారులు కాపాడారు. ఒక యువతి మాత్రం గల్లంతయ్యింది. ఆనందంగా పిక్నిక్ చేసుకుందామని వచ్చిన వీరికి చివరికి విషాదం మిగిలింది. 


దేవాస్‌లోని రాజానల్ నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు యువతులు నది సమీపంలోకి వచ్చారు. ఇంతలో ఒక యువతి కాలుజారి నదిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు మిగిలిన ఆరుగురు యువతులు ప్రయత్నించారు. అయితే వారు కూడా నదిలో పడిపోయారు. దీంతో వీరు కేకలు వేశారు. వీరిని గమనించిన మత్స్యకారులు వెంటనే నదిలోకి దిగి కాపాడారు. అయితే ఒక యువతి గల్లంతయ్యింది. ప్రస్తుతం గల్లంతైన యువతి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-01-19T16:52:03+05:30 IST