భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
ABN , First Publish Date - 2021-10-20T04:54:52+05:30 IST
భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
ఆమనగల్లు/కడ్తాల్/తలకొండపల్లి: మిలాద్-ఉన్-నబీ వేడుకలు మంగళవారం ఆమనగల్లులో ముస్లింలు జరుపుకున్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించినవేడుకను పురస్కరించుకొని జామామజీద్, మహ్మదీయ మజీద్, హైమద్ ఇలాల్ మజీద్లను అలంకరించారు. పట్టణంలో ర్యాలీకి మజీద్ అధ్యక్షుడు ఎండీ మాసూం జెండా ఊపి ప్రారంబించారు. జామా మజీద్ వద్ద అన్నదానం నిర్వహించారు. మజీద్ కమిటీ సభ్యులతో కలిసి సీఐ ఉపేందర్, ఎస్ఐ ధర్మేశ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు ముజుబుర్ రహెమాన్, మండ ల పరిషత్ కో-ఆప్షన్ హజీపాషాలను సత్కరించారు. ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాలతో మెలగాలన్నదే ప్రవక్త బోధనన్నారు. ఖాదర్ ఖాద్రీ, మొహినుద్దీన్, జబ్బార్, ఖురేషీ, నయీం, అబ్బాస్, అలీమ్, తాహేర్, అక్ర మ్, బాబ పాల్గొన్నారు. కడ్తాలలో మహ్మద్ ప్రవక్త జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇమామ్లు, నాయకు లు పాల్గొన్నారు. తలకొండపల్లి, వెల్జాల్, గట్టిప్పలపల్లి, చంద్రధన, పడకల్ గ్రా మాల్లో నబీ వేడుకలు నిర్వహించారు. ఆరీఫొద్దీన్, అజ్జూ, దస్తగిరి, షకీల్, ఖలీ ల్, మనన్, ఖాదర్, నాయకులు పాల్గొన్నారు. అన్ని పట్టణాల్లోని రహదారుపై ముస్లింలు జెండాలతో ర్యాలీ నిర్వహించి ఒకరినొకరు మహ్మద్ ప్రవక్త జన్మదిన శుభాక్షాంక్షలు తెలుపుకున్నారు. అన్నదానం నిర్వహించారు.