యాదాద్రి క్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2022-01-31T00:43:22+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.

యాదాద్రి క్షేత్రంలో భక్తుల సందడి

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. నృసింహుడి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో ఆలయ తిరువీధులు, దర్శన క్యూలైన్లు, సేవా మండపాలు కోలాహలంగా కనిపించాయి. ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యవిధి కైంకర్యాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. బాలాలయంలో కవచమూర్తులను హారతితో కొలిచిన ఆచార్యులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చించారు. మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవోత్సవం నిర్వహించి నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. 

Updated Date - 2022-01-31T00:43:22+05:30 IST