వలపర్లలో రామదండుకు భక్తుల స్వాగతం

ABN , First Publish Date - 2022-06-30T05:00:07+05:30 IST

మండలంలోని వలపర్ల, ద్వారకపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం, రామదండు బృందానికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పంగులూరు మండలం రామకూరు నుంచి వచ్చిన స్వామి దుగ్గిరాల సీతారామాంజనేయులుకు ఈ గ్రామస్థులు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి రామదండు బృందం వచ్చిందని భక్తులు ఆనంద పరవశులయ్యారు. అనంతరం ఆయనను పల్లకిలో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధులలోకి తీసుకురాగా, మహిళా భక్తులు శ్రీరామ భజనలతో ఘనంగా స్వాగతం పలికారు.

వలపర్లలో రామదండుకు భక్తుల స్వాగతం
వలపర్ల రామదండులో భజన చేస్తూ మహిళా భక్తుల సందడి

మార్టూరు, జూన్‌ 29: మండలంలోని వలపర్ల, ద్వారకపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం, రామదండు బృందానికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పంగులూరు మండలం రామకూరు నుంచి వచ్చిన స్వామి దుగ్గిరాల సీతారామాంజనేయులుకు ఈ గ్రామస్థులు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి రామదండు బృందం వచ్చిందని భక్తులు ఆనంద పరవశులయ్యారు.  అనంతరం ఆయనను పల్లకిలో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధులలోకి తీసుకురాగా, మహిళా భక్తులు శ్రీరామ భజనలతో ఘనంగా స్వాగతం పలికారు. అంతేగాకుండా ఆయన పల్లకి ముందు వీధులలో మహిళలు బిందెలతో నీటిని వార్లు పోసి, పూలతో స్వాగతం పలికారు. అనంతరం బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామ శివారు వరకు గ్రామస్థులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:00:07+05:30 IST