శ్రీవారిని దర్శించుకున్న 75 వేల మంది భక్తులు
ABN , First Publish Date - 2022-03-14T02:09:50+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రికార్డుస్థాయిలో 75,775 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రికార్డుస్థాయిలో 75,775 మంది భక్తులు దర్శించుకున్నారు. 2020 మార్చి 17వ తేదీ తర్వాత ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇదే మొదటిసారి. కొవిడ్ ప్రభావం తగ్గిన క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పెరిగిన భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు అన్ని ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలిపిరి చెక్పాయింట్లో ఎన్నడూ లేని విధంగా వాహనాలు క్యూలైన్లలో బారులుతీరాయి. చెక్పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచాయి.మరోవైపు తిరుమలలో గదులకు డిమాండ్ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి.