ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్న భక్తులు

ABN , First Publish Date - 2020-07-12T19:12:51+05:30 IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి.

ఇళ్లలోనే బోనాలు సమర్పించుకుంటున్న భక్తులు

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు ఆషాఢ బోనాలు  ప్రారంభమయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బోనాల జాతర కళ తప్పింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారి భక్తులు ఆలయంలో అమ్మవారికి కాకుండా ఇంటివద్దే బోనాలు సమర్పించుకుంటున్నారు. అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే బోనాల జాతర జరుగుతుండడం చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు బోనాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లష్కర్ ప్రాంతంలో మద్యం దుకాణాలు మూసివేశారు.

Updated Date - 2020-07-12T19:12:51+05:30 IST