రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2021-01-19T05:48:18+05:30 IST
రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది.
వేములవాడ, జనవరి 18 : రాజన్న సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, కోడెమొక్కు క్యూలైన ్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం పూజల్లో పాల్గొన్నారు. కొవిడ్-19 నిబంధనల కారణంగా లఘుదర్శనం అమలు చేస్తున్నారు. సోమవారం సుమారు 20 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.