తుపాకీతో భక్తులను బెదిరించి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

ABN , First Publish Date - 2021-01-16T04:26:54+05:30 IST

తుపాకీతో భక్తులను బెదిరించి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

తుపాకీతో భక్తులను బెదిరించి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని మన్యం ధారాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. ధారాలమ్మను దర్శించుకొని వస్తున్న భక్తులను దోపిడీ దొంగలు అడ్డుకున్నారు. నాటుతుపాకీ చూపి ఇద్దరు భక్తుల నుంచి రూ.15 వేలు, బంగారం, సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు. గూడెం కొత్తవీధి మండలం ధారకొండలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ దొంగల గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-16T04:26:54+05:30 IST