యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-30T02:51:22+05:30 IST

కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,

యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ

యాదాద్రి: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు భక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నాలుగు గంటలకే స్వామివారి నిత్య పూజలు ప్రారంభంకాగా; బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహ మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. మహిళలు క్షేత్రంలో దీపారాధన చేపట్టి, అమ్మవారికి పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-11-30T02:51:22+05:30 IST