బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-06-29T06:35:42+05:30 IST
వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది.
వేములవాడ, జూన్ 28 : వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయం మంగళవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.