దేవీపట్నంలో నీటమునిగిన గ్రామాలు
ABN , First Publish Date - 2021-07-25T06:40:25+05:30 IST
ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు దేవీపట్నం మండలంలో కొండమొదలు పరిసర గ్రామాలు, సుద్ధకొండ, కచ్చులూరు, గొందూరు, మంటూరు, మడిపల్లి మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యూరు, పూడిపల్లి, పోచమ్మగండి గ్రామాల్లో వరదనీరు ముంచెత్తింది.
దేవిపట్నం, జూలై 24: ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు దేవీపట్నం మండలంలో కొండమొదలు పరిసర గ్రామాలు, సుద్ధకొండ, కచ్చులూరు, గొందూరు, మంటూరు, మడిపల్లి మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యూరు, పూడిపల్లి, పోచమ్మగండి గ్రామాల్లో వరదనీరు ముంచెత్తింది. గతనెలలో కాపర్డ్యామ్వల్ల గోదావరి బ్యాక్వాటర్ వల్ల మండలంలో 30 గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు అధి కంగా చేరడంతో గ్రామాల్లోని ఇళ్లు పూర్తిస్థాయిలో నీటమునిగాయి. మండలంలో ఉన్న గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోతుల వరకు వరదనీరు చేరగా పోలీస్స్టేషన్ మొదటి అంతస్తుకు చేరింది. దేవీపట్నం ఆస్పత్రి, గ్రామ సచివాలయం, జూ నియర్ కళాశాల నీటమునిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.