పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-06-06T15:39:14+05:30 IST

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ: దేవినేని ఉమ

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రూ.25 లక్షల విలువ చేసే.. నివాసయోగ్యం కాని భూమికి రూ.55 లక్షలు చిల్లించారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.


‘‘పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మీ పార్టీ నాయకుల దోపిడీ.. ప్రభుత్వ సొమ్ము లూటీతో పాటు రైతుల నుంచి భారీగా వసూళ్లు. రూ.25 లక్షల విలువ చేసే.. నివాసయోగ్యం కాని భూమికి రూ.55 లక్షలు చెల్లింపు.. ప్రభుత్వాన్ని, రైతులను దోపిడీ చేస్తున్న వందల కోట్ల భూకుంభకోణంపై.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి.. జగన్‌ గారు’’ అని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T15:39:14+05:30 IST