కల్తీ మద్యం, సారాతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2022-03-21T00:44:02+05:30 IST
కల్తీ మద్యం, సారాతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో
అమరావతి: కల్తీ మద్యం, సారాతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో ఏడాదికి రూ.6 వేల కోట్ల.. ఆదాయం లక్ష్యంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. అక్రమ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కు చేరుతుందని ఆరోపించారు. ఏపీలో రూ.2 వేల నోట్లు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం, ఇసుక ద్వారా అక్రమ ఆదాయాన్ని రూ.2 వేల నోట్లుగా మార్చి.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. సారా మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.