ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు?: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-02-14T23:23:05+05:30 IST

ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు?: దేవినేని ఉమా

ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు?: దేవినేని ఉమా

అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌రెడ్డి... ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? అని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై జగన్‌రెడ్డి ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి లేఖ రాలేదని కేంద్రమంత్రే చెప్పారని అన్నారు. ఢిల్లీలో కూర్చొని కూతలు కూసే ట్విటర్‌ పిట్ట.. హోదా అంశంపై ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా సీఎం ప్రశ్నించడం లేదన్నారు. ఇరిగేషన్ మంత్రి ఫోన్‌ నెంబర్ తెలంగాణ పీఎస్‌ ఎఫ్ఐఆర్‌లో ఉంటే దీనిపై సీఎం జగన్‌రెడ్డి, సజ్జల ఎందుకు స్పందించలేదు? అని దేవినేని ఉమా ప్రశ్నంచారు. ప్రత్యేకహోదాపై టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నా.. జగన్‌రెడ్డి స్పందించలేని దుస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-02-14T23:23:05+05:30 IST