ప్రజలకు జగన్‌రెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-01-30T20:27:21+05:30 IST

గుడివాడ కేసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.

ప్రజలకు జగన్‌రెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

అమరావతి: గుడివాడ కేసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేక పెట్రోల్ పోసుకుంటారో ఆయన కర్మ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసినో వ్యవహారంలో అడ్డంగా దొరికారు కాబట్టి.. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసినో పెట్టానని మంత్రే స్వయంగా ఒప్పుకున్నారన్నారు. కేసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని,.. పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారు.. ఇప్పుడేం చేస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2022-01-30T20:27:21+05:30 IST