పెద్దల చేతుల్లోకి బడా సంస్థలు: దేవినేని

ABN , First Publish Date - 2020-08-12T23:14:44+05:30 IST

విశాఖలోని బడా సంస్థలన్నీ వరుసగా ‘పెద్దల’ చేతుల్లోకి వెళుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేసిన ఆయన..

పెద్దల చేతుల్లోకి బడా సంస్థలు: దేవినేని

విజయవాడ: విశాఖలోని బడా సంస్థలన్నీ వరుసగా ‘పెద్దల’ చేతుల్లోకి వెళుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేసిన ఆయన.. మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్ పెద్దల చేతుల్లోకి వెళ్లిన వాటిలో ఉన్నాయని ఆరోపించారు. ‘‘ఇండస్ట్రియల్ విధానంలో నిబంధనల మార్పు ఫార్మా కంపెనీలకు ఉపయోగపడ్డాయా? వాటా కొన్న ఫార్మా కంపెనీలు ఏవీ? అప్పులు ఎవరు తీరుస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఏర్పాట్లు నిజమేనా?’’ అంటూ ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు. వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-12T23:14:44+05:30 IST