ఆపదలో రిక్షాలే దిక్కయ్యాయి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-13T21:58:15+05:30 IST

అమరావతి: ఏపీలో తీవ్ర స్థాయిలో కేసులు.. మరణాలు నమోదవుతున్నాయని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.

ఆపదలో రిక్షాలే దిక్కయ్యాయి: దేవినేని ఉమ

అమరావతి: ఏపీలో తీవ్ర స్థాయిలో కేసులు.. మరణాలు నమోదవుతున్నాయని ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఆపదలో రిక్షాలే దిక్కవుతున్నాయని 108 అంబులెన్సులు ఎక్కడ? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ‘‘ప్రతి రోజు 10వేల కేసులు, 100 మృతులు. కరోనా బాధితులు వైద్యం అందక, వసతులు లేక తమ ప్రాణాలు రక్షించమని వేడుకుంటున్నారు. ఆపదలో రిక్షాలే దిక్కయ్యాయి. 108 అంబులెన్స్‌లు ఎక్కడ? కొవిడ్ విజృంభణ మీకు అర్థమవుతుందా? దయచేసి నన్ను కాపాడండి అంటూ వేడుకున్న హెడ్ మాస్టర్ మాటలు మీకు వినబడ్డాయా జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-13T21:58:15+05:30 IST