రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-05-16T01:37:13+05:30 IST

ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, ఎదిరిస్తే ..

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం: దేవినేని ఉమ

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, ఎదిరిస్తే దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఒకప్పుడు జీవో 2430 తీసుకొచ్చారని, ఇక ఇప్పుడు ఏబీఎన్ సహా మరో ఛానెల్‌పై కేసులు పెట్టారని దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని ఎండగడుతున్న మీడియాపై కేసులు నమోదు చేయడమంటే భావప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.



Updated Date - 2021-05-16T01:37:13+05:30 IST