Polavaram నిర్వాసితులను Chandrababu పరామర్శిస్తారు: Devineni Uma
ABN , First Publish Date - 2022-07-17T21:26:51+05:30 IST
పోలవరం నిర్వాసితులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శిస్తారని మాజీ మంత్రి దేవినేని చెప్పారు.
అమరావతి (Amaravathi): పోలవరం (Polavaram) నిర్వాసితులను తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu) పరామర్శిస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma) తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గురు, శుక్రవారాల్లో నిర్వాసితులను చంద్రబాబు పరామర్శిస్తారన్నారు. గోదావరి వరద (Godavari Flood) బాధితులకు అండగా నిలవాలని.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (NTR Trust Bhavan)కు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. పండ్లు, తినుబండారాలు, మంచినీటిని ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సిద్ధం చేసింది. సీఎం జగన్ అసమర్థతతో వేలాది మంది ప్రజలు ముంపులో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరాన్ని వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేశారని, సీఎం జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.