నాటి మాటలు గుర్తున్నాయా?: దేవినేని

ABN , First Publish Date - 2020-08-05T23:56:52+05:30 IST

రాజధాని వికేంద్రీకరణ నిర్ణయంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌ తీరుపై నిప్పులు చెరిగారు.

నాటి మాటలు గుర్తున్నాయా?: దేవినేని

విజయవాడ: రాజధాని వికేంద్రీకరణ నిర్ణయంపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌ తీరుపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు గతంలో అమరావతిపై చేసిన వ్యాఖ్యలను దేవినేని ఉమ గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ప్రజా రాజధానిని తరలిస్తామని ఎవరు చెప్పారు. అమరావతి వెలగబోతుంది. రాజధాని మార్పు ఆలోచనే లేదు. ఒకవేళ ఉంటే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను. తాడేపల్లిలో రాజప్రసాదం కట్టాం. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయంటూ నాటి మీ నాయకులు చేసిన ప్రకటనలు గుర్తున్నాయా వైఎస్ జగన్ గారూ..?. నాటి మాటలను కట్టిపెట్టి నేడు సొంత ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను తాకట్టు పెట్టారు.’’ అని దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

Updated Date - 2020-08-05T23:56:52+05:30 IST