జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై దేవినేని ఉమా ఫైర్
ABN , First Publish Date - 2022-01-12T22:35:26+05:30 IST
జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలతో ప్రజాగ్రహానికి..
కృష్ణా: జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలతో ప్రజాగ్రహానికి జగన్ సర్కార్ గురైందన్నారు. కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఆర్థికమంత్రి, ప్రధానికి ఇచ్చిన వినతి పత్రాలను జగన్ ప్రభుత్వం మీడియా ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని చానెళ్ళ ప్రసారాలను వీక్షించవద్దన్న అధికారపార్టీ తీరుపై ఉమా మండిపడ్డారు.