దేవినేని రమణకు ఘననివాళి
ABN , First Publish Date - 2020-06-05T09:18:35+05:30 IST
సాగు, తాగు నీరందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత దేవినేని వెంకటరమణకే దక్కిందని ..
కంచికచర్ల రూరల్ : సాగు, తాగు నీరందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత దేవినేని వెంకటరమణకే దక్కిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. రమణ, ప్రణీతల వర్ధంతిని గురువారం నిర్వహించారు. పరిటాలలో రమణ, తంగిరాల ప్రభాకరరావు, కోగంటి వెంకటేశ్వరరావు విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసిపూల మాలలు వేసి నివాళులర్పించారు. రమణ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కోగంటి బాబు, నన్నపనేని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.