కోవిడ్‌కి హాట్ స్పాట్‌గా ఏపీ: దేవినేని

ABN , First Publish Date - 2020-08-02T18:33:26+05:30 IST

కోవిడ్‌కి హాట్ స్పాట్‌గా ఏపీ: దేవినేని

కోవిడ్‌కి హాట్ స్పాట్‌గా ఏపీ: దేవినేని

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాల తీవ్రత అధికంగా ఉన్నా... ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోంది అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కరోనా కేసులు లక్షా యాభై వేలు దాటేశాయ్, మరణాలు1400 దాటాయి. నెలలో 10రెట్ల కేసులు, ఏడున్నర రెట్ల మరణాలు పెరిగాయి. కోవిడ్‌కి హాట్ స్పాట్‌గా ఏపీ మారింది. తీవ్రత రికార్డుస్థాయిలో ఉంది. ఇల్లే ఓ క్లినిక్ అయ్యింది. రాజధాని మార్పు పక్కన బెట్టి కరోనా మీద దృష్టిపెట్టండి జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-08-02T18:33:26+05:30 IST