కాళరాత్రి దేవిగా, సరస్వతీ మాతగా.. !
ABN , First Publish Date - 2020-10-24T08:37:43+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఏడో రోజైన శుక్రవారం అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు
వివిధ రూపాల్లో అమ్మవార్లు
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఏడో రోజైన శుక్రవారం అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల జిల్లా అలంపూర్లోని జోగుళాంబ దేవి, బాసర సరస్వతి, వేములవాడ రాజరాజేశ్వరి దేవి కాళరాత్రి దేవిగా సాక్షాత్కరించారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారు సరస్వతీ మాతగా, మెదక్ జిల్లా ఏడుపాయలలో వన దుర్గామాత శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు.