అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-10-21T05:54:22+05:30 IST

గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధి, సంక్షేమాని కి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నా రు.

అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట
జీపీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

రాయికల్‌, అక్టోబరు 20 : గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధి, సంక్షేమాని కి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నా రు. రాయికల్‌ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేయడంతో పాటు గ్రామపంచాయతీ భవనాలు, వైకుంఠదామా లు, పల్లె ప్రకృతి వనాలను బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణా దేశంలోనే మొద టి స్థానంలో ఉందని అన్నారు. కిష్టంపేట గ్రామంలో మండల పరిషత్‌ నిధు లు రూ.2.26లక్షలతో సీసీ, డ్రైన్‌, అల్లీపూర్‌లో మండల పరిషత్‌ నిధులు రూ. 3లక్షలతో డ్రైనేజీ, ఆలూరు గ్రామంలో వైకుంఠదామం, పంచాయతీ ని ధులు రూ.3లక్షలతో సీసీరోడ్డు భూమిపూజ, తాట్లవాయిలో 16లక్షలతో నిర్మిం చిన పంచాయతీ భవనం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, కంపోస్ట్‌షెడ్‌, కైరి గూడెంలో ఎస్టీ సంఘ భవనం, స్మశానవాటికలను ఎమ్మెల్యే ప్రారంభించా రు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని, మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ గన్నె రాజరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రాలింగం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:54:22+05:30 IST