TS News: నేను రాజీనామా చేశాకే అభివృద్ధి పనులు: కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN , First Publish Date - 2022-08-15T22:28:04+05:30 IST

Yadadri: మాజీ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 21న జరిగే బహిరంగసభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

TS News: నేను రాజీనామా చేశాకే అభివృద్ధి పనులు: కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి

Yadadri: మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 21న జరిగే బహిరంగసభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీనామా చేశాకే చౌటుప్పల్ -సంస్థాన్ నారాయణపురం రోడ్ ఆగ మేఘాల మీద వేస్తున్నారని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయక ముందు అసెంబ్లీలో గట్టుపల్ మండలం, చౌటుప్పల్‌లో రోడ్లను బాగు చేయాలని అడిగినా ఇవ్వలేదన్నారు. రాజీనా  చేసిన 20 రోజుల్లోనే పనులు అవుతున్నాయన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో రాష్ట్ర ప్రజల తలరాతలు ముడిపడి ఉన్నాయన్నారు. బీజేపీకి అమ్ముడు పోయానని తెలుపుతున్న జిల్లా మంత్రికి సవాల్ చేస్తున్న మీడియా ముందు ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు.  మంత్రి అవినీతిపై త్వరలో చిట్టా విప్పుతానన్నారు. దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలన్నారు. 


 

Updated Date - 2022-08-15T22:28:04+05:30 IST