అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ చైర్మన్
ABN , First Publish Date - 2021-01-20T06:39:45+05:30 IST
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
ఆదిలాబాద్ అర్బన్, జనవరి 19: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంగళవారం తిర్పెల్లి, క్రాంతినగర్లలో చేపడు తున్న శ్మశాన వాటిక పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన సాగు తున్నాయని, వాటిలో మరింత వేగం పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత గుత్తెదారులు, అధికారులను ఆదేశించారు. ఇందులో కౌన్సిలర్ సతీష్, పార్టీ నాయకులు గోవర్ధన్రెడ్డి, శంకర్, తదితరులున్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
జైనథ్: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని మాకోడ గ్రామంలో స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకొని నాయకులతో కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ ప్రథమ విజేతకు రూ.30వేలు ఎమ్మెల్యే జోగు రామ న్న, ద్వితీయ బహుమతి రూ.15వేలు గ్రామ సర్పంచ్ ఎం.సురేఖ అందజే స్తార న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం.గోవర్ధన్, జడ్పీటీసీ టి.అరుంధ తి, యూత్ అధ్యక్షుడు నిమ్మల లచ్చారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.