అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-06-22T06:57:38+05:30 IST
గ్రామాల్లో వైకుంఠధామా లు, పల్లె ప్రకృతి, ఇతర అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఏంపీవో, ఏపీవో, పంచాయతీ రాజ్ ఏఈలు, టెక్నికల్ అసిస్టెంట్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
కోదాడరూరల్, జూన్ 21: గ్రామాల్లో వైకుంఠధామా లు, పల్లె ప్రకృతి, ఇతర అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఏంపీవో, ఏపీవో, పంచాయతీ రాజ్ ఏఈలు, టెక్నికల్ అసిస్టెంట్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏఒక్క వైకుంఠధామానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదని, వెంటనే దాన్ని పూర్తి చేయాలన్నారు. అందుకు ప్రత్యేక నిధులు లేకుంటే, గ్రామపంచాయతీ నిధులు కేటాయించాలని సూచించారు. వైకుంఠధామం చుట్టూ ఐదు అడుగుల కోనొకార్పస్ మొక్కలు ఆరడుగుల దూరంతో రెండు వరుసల్లో నాటాల ని ఆదేశించారు. వైకుంఠధామాలకు గేటు,ఆర్చికి ఒకే రం గు వేయించాలన్నారు. ఇప్పటి వరకు మిగిలివున్న పనుల ను ఎక్కువ మంది కూలీలు ఏర్పాటుచేసి నాలుగు రోజు ల్లో పూర్తిచేయాలన్నారు. చేసిన పనికి, చెల్లింపులకు తేడా ఉండకూడదన్నారు. మరో మూడు రోజుల్లో మండలంలో పర్యటించి పనులను పరిశీలిస్తానని, విధుల్లో అలసత్వం చూపిస్తే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.