టీఆర్ఎస్తోనే అభివృద్ధి
ABN , First Publish Date - 2022-05-22T05:00:14+05:30 IST
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మరికల్, మే 21 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బుడ్డగానితండా గ్రామ పరిధిలో పల్లె ప్రకృతి వనాన్ని శనివారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్కు నామకరణం, చిన్నారులకు ఏర్పాటు చేసిన ఆట పరికరాలను, యువకులకు క్రికె ట్, వాలీబాల్ గ్రౌండ్లను పరిశీలించి యువకులతో ఆడారు. అనంతరం గాజుల య్యతండాలో పాఠశాలను సందర్శించారు. గిరిజనతండాలో ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్యను అభినందించారు. కొన్ని సంవత్సరాల క్రితం పాఠశాలకు విద్యార్థులు రాని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారన్నారు. ఒకే గది ఉండడంతో విద్యార్థులు కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయుడు లక్ష్మయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లా రు. స్పందించిన ఎమ్మెల్యే మూడు అదనపు గదులకు తన నిధుల నుంచి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర్, రాజవర్ధన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, జయరాంనాయక్, రాములునాయక్, బాల్రాజ్ పాల్గొన్నారు.