గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-16T05:59:55+05:30 IST

గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు 15: గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో సోమవారం రూ.20లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలను ప్రామాణికంగా తీసుకుని గ్రామస్థులకు మౌలిక వసతులు కల్పిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలతో గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని లక్ష్మీపురం సర్పంచ్‌ బండ రవీందర్‌రెడ్డితో పాటు పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌, జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ బండ రవీందర్‌ఱెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ రావి సదానందం, గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-16T05:59:55+05:30 IST