పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

ABN , First Publish Date - 2020-10-25T05:40:55+05:30 IST

సీఎం కేసీఆర్‌ విధానాలతో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం నజీరాబాద్‌తండాలో పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు.

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

పరిగి: సీఎం కేసీఆర్‌ విధానాలతో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే  మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం నజీరాబాద్‌తండాలో పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌, ఎంపీవో దయానంద్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచులు జగన్‌, గణేశ్‌నాయక్‌, ిపీఏసీఎస్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌, డైరెక్టర్‌ పి.హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T05:40:55+05:30 IST