జగిత్యాలలో నర్సరీల అభివృద్ధి
ABN , First Publish Date - 2021-04-17T05:39:21+05:30 IST
హత జగిత్యాలే లక్ష్యంగా నర్సరీలను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 16 : హత జగిత్యాలే లక్ష్యంగా నర్సరీలను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. పట్టణంలోని టీఆర్నగర్, ధరూర్ క్యాంపులో ఉన్న నర్సరీల్లో మొక్కల పెంప కాన్ని అరుణశ్రీ శుక్రవారం పరిశీలించారు. మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచుతున్న 10 లక్షల మొక్కల పెంపకాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి వేంకటేశ్వర్ రావు, కమిషనర్ మారుతీ ప్రసాద్, ఏఈ శరణ్ తేజ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు అశోక్, రాము తదితరులు ఉన్నారు.