కాంగ్రెస్‌తోనే రైతుల అభివృద్ధి : రమేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-28T05:52:28+05:30 IST

రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌తోనే రైతుల అభివృద్ధి : రమేష్‌రెడ్డి
టేకుమట్లలో భారీ ర్యాలీతో వస్తున్న పటేల్‌ రమేష్‌రెడ్డి

సూర్యాపేట రూరల్‌, మే 27 :  రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో శుక్రవారం చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గట్టు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ వందశాతం అమలు చేస్తుందన్నారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, రైతులకు వరంగల్‌ డిక్లరేషన్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, పాలవరవు వేణు, ధరావత్‌ వెంకన్న, ఎంపీటీసీ చింత అలివేలు, ఉపసర్పంచ్‌ లక్ష్మీనారాయణ, మండల్‌రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, వెలుగు వెంకన్న, షఫీఉల్లా, పాలడుగు పరుశరాములు, పిల్లల రమేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T05:52:28+05:30 IST