దళితుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-29T06:36:58+05:30 IST

దళితుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

దళితుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఇల్లంతకుంటలో వ్యాపారసంస్థను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఇల్లంతకుంట, జూన్‌ 28: దళితుల అభివృద్ధే లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  అన్నారు. మండలంలోని కేసన్నపల్లెకు చెందిన చిట్యాల చుక్కయ్య దళితబంధు పఽథకం కింద మంజూరైన నిధులతో ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితులను ఓటర్లుగా మాత్రమే చూశాయన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  జడ్పీవైస్‌ చైర్మెన్‌ సిద్దం వేణు, ఏఎమ్‌సీ చైర్మెన్‌ మామిడి సంజీవ్‌, సెస్‌డైరెక్టర్‌ గుడిసె అయిలయ్య, సర్పంచ్‌ పోతరాజు ఎల్లవ్వ, ఎంపీటీసీ సావనపెల్లి వనజఅనీల్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహ్మరెడ్డి, నాయకులు పోతరాజు చంటి, దమ్మని లక్ష్మన్‌, దొంతి మల్లయ్య, రాగటి రమేష్‌, సూర్యగౌడ్‌, దమ్మని మధు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:36:58+05:30 IST