రూ. 2వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

ABN , First Publish Date - 2020-05-15T09:29:20+05:30 IST

రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని రూ.2వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.

రూ. 2వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు


రైల్వేకోడూరు, మే, 14:  రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని రూ.2వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండల పరిధిలోని రెడ్డివారిపల్లె బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈబ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు మంజూరు చేస్తామన్నారు.


ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు పంపారని తెలిపారు. గడిచిన తొమ్మిది నెలల్లో రైల్వేకోడూరు నియోజకవర్గంలో రూ.150 కోట్లతో సీసీరోడ్డు, బిడ్ర్జిలు, తాగు. సాగునీరు తదితర రంగాలకు నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆర్‌అండ్‌బీ డీఈ వేణుగోపాల్‌, తహసీల్దార్‌ జే. శిరీషా, పంచాయతీ రాజ్‌ డీఈ శ్యామ్‌సుందర్‌రాజు, ఎంపీడీవో పఠాన్‌ మహబూబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-15T09:29:20+05:30 IST