పద్మశాలీయుల ఐక్యతతోనే అభివృద్ధి సాధించాలి
ABN , First Publish Date - 2021-10-26T04:39:08+05:30 IST
ఐకమత్యంగా ఉన్నప్పుడే పద్మశాలీయు లు అభివృద్ధి సాధించగలరని పద్మశాలీయ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జింకా విజయలక్ష్మి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు టౌన్, అక్టోబరు 25: ఐకమత్యంగా ఉన్నప్పుడే పద్మశాలీయు లు అభివృద్ధి సాధించగలరని పద్మశాలీయ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జింకా విజయలక్ష్మి పేర్కొన్నారు. రామేశ్వరంలోని భద్రావ తి, భావన్నారాయణస్వా మి ఆలయంలో పద్మశాలీ య బహుత్తమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీనిఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా మే రువ పెంచలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నందం లక్ష్మణకుమార్, ప్రధాన కార్యదర్శి గా జిం కా జయప్రసాద్, కోశాధికారిగా సురే్షబాబు, గౌరవాధ్యక్షులుగా డాక్టర్ సోమా లక్ష్మినరసయ్య, గు ర్రం చిన్న వెంకటసుబ్బయ్య, వెంకటసుబ్బన్న, నాగమళ్ల శంకర్, పోలంకి వరదరాజులు, గౌరవ సలహాదారులుగా వద్ది నరసింహులు, సాధు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా చెన్నావెంకటకృష్ణ, జింకా రామకృష్ణ, సదానందం, సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో దొరసానిపల్లె సర్పంచి అరవ ఈశ్వరమ్మ, కౌన్సిలర్లు బలిమిడి వెంకటలక్ష్మి, అనిల్కుమార్, సంఘం పెద్దలు పాల్గొన్నారు.