వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2020-10-01T06:07:36+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్నారాయణ తెలిపా రు. బుధవారం రైల్వేకోడూరులో చిట్వేలి మార్గంలో నూతన బ్రిడ్జిని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్నారాయణ
రైల్వేకోడూరు, సెప్టెంబరు, 30: వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకర్నారాయణ తెలిపా రు. బుధవారం రైల్వేకోడూరులో చిట్వేలి మార్గంలో నూతన బ్రిడ్జిని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏ ప్రభుత్వాలలో లేని విధంగా ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.
చిట్వేలి రోడ్డు గుంజన నదిపై రూ.6.90 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిని నిర్మించారని తెలిపారు. రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్గార్గ్, డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, ఈఈ మహేశ్వర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వీరన్న, డీఈ శివరుద్రగౌడ్, తహసీల్దార్ శిరీషా, రైల్వేకోడూరు ఎస్ఐలు పెద్దఓబన్న, రెడ్డిసురేష్, వైసీపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి ధ్వజారెడ్డి, జిల్లా నేత పంజం సుకుమార్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమే్షబాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మందల నాగేంద్ర, యువ నాయకుడు తోట శివసాయి తదితరులు పాల్గొన్నారు.