చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2022-08-20T05:51:38+05:30 IST
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, చంద్రబాబుతోనే తిరిగి రాష్ట్ర అభివృద్ది సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
బాదుడే-బాదుడు కార్యక్రమంలో అశోక్బాబు
కంభం (బేస్తవారపేట), ఆగస్టు 19 : గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, చంద్రబాబుతోనే తిరిగి రాష్ట్ర అభివృద్ది సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కంభం మండలం ఔరంగబాద్ పంచాయతీలోని నడింపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అశోక్రెడ్డి మాట్లాడుతూ కళ్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలను మరిచాడని, పేదలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గ్యాస్ ధర రూ.400 ఉండగా నేడు మూడింతలు పెరిగిందన్నారు. విద్యుత్ బిల్లులు, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. పేదలు చిమ్మచీకటిలో అర్థాకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు చార్జీల ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచారని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన సంక్షేమాన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం విషయాన్ని ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోట శ్రీనివాసులు, కేతం శ్రీను, గోన చెన్నకేశవులు, గౌస్, మాధవమూర్తి, రంగారెడ్డి, మురళీకృష్ణ, రంగయ్య, వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో అంతా సర్వనాశనం
త్రిపురాంతకం : వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని టీడీపీ వై.పాలెం ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. మండలంలోని రాజుపాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బిల్లులు, డీజిల్, పెట్రోల్, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ పెరిగాయన్నారు. గ్రామాలలో అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయాయని, సామాన్యులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా వస్తుందని, తాగు సాగు అవసరాలు తీర్చే వెలుగొండ పూర్తవుతుందని అన్నారు. అంతకుముందు గ్రామంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మేకల వలరాజు, మాజీ అధ్యక్షుడు మోటకట్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాసరరెడ్డి, వి.ఆంజనేయులు, కటికి ఏడుకొండలు, ఎం.అల్లూరిరెడ్డి, కె.కోటేశ్వరరావు, మాబు, డి.బ్రహ్మయ్య, వర్ధన్బాబు, గ్రామపార్టీ అధ్యక్షుడు కందుల రమణారెడ్డితదితరులు పాల్గొన్నారు.
ధరలు పెంచి దడ పుట్టిస్తున్న ప్రభుత్వం
మార్కాపురం(వన్టౌన్) : రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అన్ని రకాలుగా ధరలు, పన్నులు పెంచి ప్రజ లకు జీవించే అవకాశం లేకుండా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. మండ లంలోని జమ్మన పల్లెలో శుక్రవారం రాత్రి బాదుడే బాదు డు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా యణరెడ్డి మాట్లాడుతూ.. పెంచిన ఽవిద్యుత్, ఆస్తి, వివిధ రకాల పన్నులను తగ్గించాలన్నారు. సంక్షేమ పథకా లంటూ ప్రజా జీవితాలను సంక్షభంలోకి నెడుతున్నా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు త్వరలోనే ప్రజలు బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయన్నారు.