AP News: ఏపీలో విద్యా సంస్థల అభివృద్ధిలో పురోగతి లేదు: కనకమేడల

ABN , First Publish Date - 2022-09-28T21:52:39+05:30 IST

ఏపీలో విద్యా సంస్థల అభివృద్ధిలో పురోగతి లేదని ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) దుయ్యబట్టారు.

AP News: ఏపీలో విద్యా సంస్థల అభివృద్ధిలో పురోగతి లేదు: కనకమేడల

విజయవాడ: ఏపీలో విద్యా సంస్థల అభివృద్ధిలో పురోగతి లేదని ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఏపీలో ఉందని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టలేక ప్రభుత్వం చతికిలబడిందని ఎద్దేవాచేశారు. విభజన హామీలనూ సాధించలేకపోయారని తప్పుబట్టారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తున్నా పట్టించుకోవడం లేదని, రైల్వేజోన్ కోసం కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ఏపీ ప్రభుత్వం మిన్నకుండి పోయిందని కనకమేడల రవీంద్ర దుయ్యబట్టారు.

Updated Date - 2022-09-28T21:52:39+05:30 IST