అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు

ABN , First Publish Date - 2022-05-09T20:46:12+05:30 IST

జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(satyavati rathor) తో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు. చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు(harish rao) పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(satyavati rathor) తో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు. చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు(harish rao) పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో గల సింగరేణి క్వార్టర్స్ సమీపంలో నూతన జిల్లా ఆసుపత్రి భవనం నిర్మాణానికి,50 పడకల ఆయుష్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మంజు నగర్ లో ఏరియా ఆసుపత్రి ముందు నూతన డయాగ్నస్టిక్ హబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


అనంతరం ఏరియా హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసి పరికరాలను పరిశీలించారు.అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, TSMSIDC ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి.దివ్యంగుల కార్పొరేషన్ ఛైర్మెన్ వాసుదేవ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Read more