సంక్షోభంలోనూ దీటుగా సంక్షేమం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-05-09T05:01:14+05:30 IST
కరోనా మహామ్మారి వలన తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అత్యంత సమర్థవంతంగా అమలుచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు.
వైరా, మే 8: కరోనా మహామ్మారి వలన తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అత్యంత సమర్థవంతంగా అమలుచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. శనివారం తమ క్యాంపు కార్యాలయంలో వైరా మునిసిపాలిటీ పరిధిలోని 27మంది బాధితులకు రూ.9.63లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అలాగే రెబ్బవరం గ్రామంలో 31మందికి రూ.7.26లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా విలయతాండవం చేస్తున్నా కేసీఆర్ ధృడసంకల్పంతో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మునిసిపల్ వైస్చైర్మన్ ముళ్లపాటి సీతరాములు, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, రెబ్బవరం, అష్ణగుర్తి సర్పంచ్లు సాధం రామారావు, ఇటుకల మురళీ, ఉపసర్పంచ్ గుత్తా కృష్ణ, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పసుపులేటి మోహన్రావు, ధార్న రాజశేఖర్, కౌన్సిలర్లు డాక్టర్ డి.కోటయ్య, తడికమళ్ల నాగేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్.బీబా, అప్పం సురేష్, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్రావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ,. చల్లా సతీష్ పాల్గొన్నారు.