ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ABN , First Publish Date - 2021-10-26T03:40:38+05:30 IST

విద్యార్థులు చదువులలో రాణించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్ధులకు పోలీసుల విధులు, వివిధ రకాల ఆయుధాలు, బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ పనితీరుపై అవగాహన కల్పించారు.

ఉత్తమ పౌరులుగా ఎదగాలి
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది

గూడూరు, అక్టోబరు 25: విద్యార్థులు చదువులలో రాణించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్ధులకు పోలీసుల విధులు, వివిధ రకాల ఆయుధాలు, బాంబుస్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణకు పాటుపడేది పోలీసు వ్యవస్థేనన్నారు. విద్యార్ధులకు పోలీసు విధులపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించా మన్నారు. కార్యక్రమంలో సీఐ నాగేశ్వరమ్మ, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T03:40:38+05:30 IST