-
-
Home » Andhra Pradesh » Devatoti Nagraju comments-MRGS-AndhraPradesh
-
‘CM Jagan సొంత జిల్లాలో ఘోరం జరిగినా.. స్పందించకపోవడం సిగ్గుచేటు’
ABN , First Publish Date - 2022-05-12T18:24:33+05:30 IST
CM Jagan సొంత జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం నేరస్తుల...
అమరావతి: CM Jagan సొంత జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం నేరస్తుల విచ్చలవిడితనానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఘోరం జరిగినా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను ప్రభుత్వం అరికట్టలేక పోతోందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న ప్రతీ దుశ్చర్య మానవత్వానికి సిగ్గుచేటుగా ఉందన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను హ్యూమన్ రైట్స్ కమిషన్, హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించాలని, అప్పుడే దళిత మహిళకు న్యాయం జరుగుతుందని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.